President Election 2022 | రాష్ట్రపతి ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సరైన సత్రాలు లేకపోవడంతో ఒకరి నామినేషన్ను తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనుండగా.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29 వరకు కొనసాగనున్నది.
నామినేషన్ దాఖలు చేసిన వారిలో బిహార్ సరన్కు చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి సైతం ఉన్నారని పార్లమెంటరీ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారని తెలుస్తున్నది. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని నిర్ణీత ఫార్మాట్లో నింపి, ఎలక్టోరల్ సభ్యుల్లో 50 మంది ప్రతిపాదించాల్సి ఉండగా.. మరో 50 మంది ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అలాగే రూ.15వేలు డిపాజిట్ చేయాలి.