న్యూఢిల్లీ, డిసెంబర్ 26: రాష్ట్రపతి ఆమోదంతో మూడు నేర న్యాయ బిల్లులు చట్టాలుగా మారాయి. ఐసీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య(బీఎస్) చట్టాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయా చట్టాల్లోని అంశాలపై చర్చ నడుస్తున్నది. చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం(యూఏపీఏ), మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసుల్లో మాదిరిగానే ఇకపై బీఎన్ఎస్ఎస్ కేసుల్లో కూడా బెయిల్ పొందడం కష్టంగా ఉంటుందనే వాదన వినిపిస్తున్నది. బీఎన్ఎస్ఎస్లోని 479(1), 479(2) తదితర క్లాజులు పలు కేసుల్లో, పలు సందర్భాల్లో బెయిల్ పొందడం కష్టం చేశాయని విశ్లేషిస్తున్నారు.