హైదరాబాద్, మార్చి 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ గురువారం నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ వీరిని ఎంపిక చేసింది. ప్రస్తుతం కేం ద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్గా ఉన్నారు. కమిషనర్గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్ అరుణ్ గో యెల్ ఇటీవల అనూహ్యంగా రాజీనామా చే శారు.
కేరళకు చెందిన కుమార్, ఉత్తరాఖండ్కు చెందిన సంధూ ఇద్దరూ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో కుమార్ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా, సంధూ గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా వ్య వహరించారు. కాగా, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీం లో నేడు విచారణ జరగనుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ , ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించి ఆ స్థా నంలో క్యాబినెట్ మంత్రిని చేర్చటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.