ఉత్తరప్రదేశ్ ; మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకొన్నది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే సంగమంలో వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతి ఏడాది పుష్య పూర్ణమి నుంచి మాఘ పూర్ణమి వరకు ఇక్కడ మాఘ మేళా జరుగుతుంది. మకర సంక్రాంతి నాడు ఇక్కడ పుణ్యస్నానమాచరిస్తే మంచిదనేది భక్తుల నమ్మకం.