ఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యనిర్వాహక సీవీసీగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం ఈ నెల 24తో ముగిసిన నేపథ్యంలో నూతన బాధ్యతలను ప్రవీణ్ కుమార్ చేపట్టనున్నారు.
1988 బ్యాచ్ ఐఏఎస్ అయిన ప్రవీణ్కుమార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించారు. ప్రవీణ్కుమార్తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ అర్వింద్ కుమార్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు. విజిలెన్స్ కమిషన్లో సీవీసీ, ఇద్దరు కమిషనర్లు ఉంటారు.