ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి, గద్దెనెక్కాలని కాంగ్రెస్ పట్టు దలతో వుంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కచ్చితంగా పార్టీ చెప్పకపోయినా…. అధికారాన్ని మాత్రం జేచిక్కించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో దేశమంతా కాంగ్రెస్కు జవసత్వాలు నింపాలని సోనియా గాంధీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదట వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు పార్టీ గెలుపు బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు, త్వరలోనే పీకే కాంగ్రెస్లోకే చేరిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇందులో వాస్తవాలు లేవని పార్టీ పేర్కొంది.
ఇప్పుడు కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థానంలో ఆయన సన్నిహితుడు సునీల్ కనుగోలును రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు మార్లు ఈయన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపుతేవడంతో పాటు.. రాహుల్ ఇమేజ్ను కూడా పెంచే బాధ్యతను సునీల్ భుజాలపై మోపింది. గతంలో సునీల్ బీజేపీ, డీఎంకే, అన్నా డీఎంకే, అకాలీదళ్కు పనిచేశారు.