పనాజీ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. అయితే, కేబినెట్ మంత్రులు ప్రమాణం చేస్తారా? లేదా? తెలియరాలేదు. ఈ విషయంపై ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ‘రేపు మీకే తెలుస్తుంది.
ప్రస్తుతం ఎంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారో నాకు తెలియదు’ అన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 21 స్థానాలను గెలువలేకపోయింది. ఎంజీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 21 స్థానాలను గెలువలేకపోయింది. ఎంజీపీ, స్వతంత్రులు మద్దతు తెలిపారు.