Prakash Raj | కోజికోడ్, జనవరి 14: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ‘మూడు రాజకీయ పార్టీలు’ టికెట్ ఆఫర్ చేస్తున్నాయని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. అయితే తాను అనుసరిస్తున్న సిద్ధాంతం నచ్చి కాకుండా.. ప్రధాని మోదీ విమర్శకుడిగా ఉన్నానన్న కారణంతో ఆయా పార్టీలు తన వెంట పడుతున్నాయని శనివారం కోజికోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు.
అలాంటి ట్రాప్లో తాను పడబోనన్న ప్రకాశ్ రాజ్.. తనను సంప్రదించిన పార్టీలేవో చెప్పలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రకాశ్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.