ముంబై : ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిఖిల్ జైన్ డిజిటల్ సామర్థ్యాన్ని నమ్ముకుని విజేతగా నిలిచారు. నిఖిల్ జైన్ డిసెంబరులో కేరళలోని ఓ నేషనల్ పార్కులో బస్సులో ప్రయాణిస్తుండగా ఆయన ఎయిర్ పాడ్స్ పోయాయి. సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో వాటిని గుర్తించలేకపోయారు.
కొద్ది దూరం వెళ్లిన తర్వాత పరిశీలిస్తే, ఆ ఎయిర్పాడ్స్ను ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్టు, ఆ వ్యక్తి 40 కిలోమీటర్ల దూరంలోని వేరొక నేషనల్ పార్క్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తి చివరికి మంగళూరు నుంచి గోవాకు వెళ్లినట్టు గుర్తించారు. సోషల్ మీడియాపైన ఉన్న గట్టి నమ్మకంతో నిఖిల్ డిసెంబరు 21న ఓ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు డిటెక్టివ్లుగా మారిపోయారు. చివరికి ఆ ఎయిర్పాడ్స్ మార్గోవా పోలీస్ స్టేషన్కు చేరాయి. డిసెంబరు 22న సాయంత్రం స్నేహితుడు తీసుకొచ్చి, నిఖిల్కు అందజేశారు.