పర్బణీ: మహారాష్ట్రలోని పర్బణీ జిల్లా మానవత్ తాలూకాలోని యశ్వాడిలో శనివారం నిర్మాణంలో ఉన్న హనుమాన్ ఆలయ పైకప్పు కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమం జరుగుతుండగా ఈ విషాదం చోటుచేసుకున్నది.
గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మానవత్ తహశీల్దార్ పాండురంగ మోచేవాడ్ తెలిపారు. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను వెలుపలికి తీసుకువచ్చి, సమీపంలోని దవాఖానలకు తరలించాయన్నారు.