ముంబై: మహారాష్ట్రలో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇటీవలే ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ సర్కారులో చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థికశాఖను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హోంమంత్రిగానే కొనసాగనున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే గ్రామీణాభివృద్ధి శాఖను అట్టిపెట్టుకున్నారు.
ఇక అజిత్ పవార్తో కలిసి ఎన్సీపీని వీడిన సీనియర్ నేత చగన్భుజ్బల్కు ఆహార, పౌరసరఫరాల శాఖను అప్పగించారు. గతంలో మహా కూటమి ప్రభుత్వంలో కూడా భుజ్బల్ అదే శాఖ బాధ్యతలు నిర్వహించారు. ఇక మరో క్యాబినెట్ మినిస్టర్ దనంజయ్ ముండేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు.
ఈ నెల 2న అజిత్ పవార్ తన బాబాయ్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్రంలోని ఎన్డీఏ కూటిమిలో చేరారు. అందుకు ప్రతిఫలంగా అతనికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అతనితోపాటు ఎన్సీపీ నుంచి వెళ్లిన మరో 8 మంది చేత కూడా అదేరోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు.