కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ (70) కన్నుమూశారు. కరోనా మహమ్మారి సోకడంతో కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. అనీశ్కు భార్య, ఒక కూతురు ఉన్నారు.
కొన్ని రోజుల క్రితమే గుండెపోటు రావడంతో అనీశ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే కరోనా సోకడంతో మళ్లీ ఆస్పత్రి పాలైన ఆయన ఇవాళ మృతిచెందారు. 1951లో జన్మించిన అనీశ్ దేవ్ తన 18 ఏటనే రచించడం మొదలుపెట్టారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా బెంగాల్ ప్రభుత్వం 2019లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో