స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ ; కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కలగానే మిగిలిపోతున్నది. స్కూల్ పిల్లల స్కాలర్షిప్ల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల ఫెలోషిప్ల వరకూ భారీగా కోత పెడుతుండటమే దీనికి కారణం. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు దూరమవుతున్నారు.
మరికొన్ని కోతలు ఇలా..
మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఏఎన్ఎఫ్)ను రద్దు చే స్తున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎంఏఎన్ఎఫ్ కోసం రూ. 100 కోట్ల నిధులను కేటాయించిన సర్కారు.. ప్రస్తు తం ఆ ఫెలోషిప్నే ఎత్తేసింది.
జాతీయ అర్హత పరీక్ష (నెట్) కాకుండా, వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఫిల్, పీహెచ్డీలు చేసే విద్యార్థులకు యూజీసీ ఫెలోషిప్లను కేంద్రం రద్దు చేసింది.
నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నదన్న సాకుతో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ పేరిట ఇస్తున్న ఉపకార వేతనాలనూ కేంద్రం రద్దుచేసింది.