Elections Schedule | మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో జనవరి 11వ తేదీన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించింది. వరుస సమావేశాలు నిర్వహించింది. ఎన్నికలపై ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుంది.