న్యూఢిల్లీ, జూన్ 7: ‘మీరు ఎన్నికల సమయంలో ఎక్కడైతే ఓటు వేస్తారో.. అక్కడే ప్రస్తుతం కరోనా టీకా కూడా వేస్తారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు తెలిపారు. ‘ఓటు వేసే చోటే కరోనా టీకా’ పేరుతో సోమవారం కొత్త తరహా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఢిల్లీలోని పోలింగ్ బూత్లను కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లుగా మార్చుతున్నట్టు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో) ఇంటింటికి తిరిగి 45 ఏండ్లు పైబడిన వారికి టీకా స్లాట్ బుక్ చేస్తారని, వారంతా స్లాట్ సమయంలో పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి టీకా వేసుకోవాలని సూచించారు.