న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వెల్లడించాయి. బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్, రాజస్ధాన్లో ఇరు పార్టీల మధ్య ఓట్లు, సీట్ల మధ్య తేడా స్వల్పంగా ఉండటంతో ఇతరులు కీలక పాత్ర పోషించనున్నారు.
ఇక పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్ధాన్లో బీజేపీ 100 నుంచి 110 స్ధానాలు, కాంగ్రెస్ 90 నుంచి 100 స్ధానాలు, ఇతరులు 5-15 స్ధానాలు గెలుచుకోవచ్చని వెల్లడైంది.
మధ్యప్రదేశ్లో 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 111 నుంచి 121 స్ధానాలు, బీజేపీ 106 నుంచి 116 స్ధానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. ఛత్తీస్ఘఢ్లో 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ 40 నుంచి 50 స్ధానాలు, బీజేపీ 35 నుంచి 45 స్ధానాలను, ఇతరులు 3 స్ధానాలను గెలుచుకోవచ్చని పేర్కొంది.
రాజస్ధాన్
బీజేపీ 100-110 (41.8)
కాంగ్రెస్ 90-100 (39.9)
ఇతరులు 5-15
మధ్యప్రదేశ్ 230
బీజేపీ 106-116
కాంగ్రెస్ 111-121
ఇతరులు 0-6
ఛత్తీస్ఘఢ్ 90
బీజేపీ 35-45
కాంగ్రెస్ 40-50
ఇతరులు 0-3
Read More :