న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శుక్రవారం ప్రకటించకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధాని మోదీ మరింతగా గుజరాత్కు వాగ్దానాలు, ప్రారంభోత్సవాల కోసమే ఈసీ ఉద్దేశ పూర్వకంగా ఎన్నికలను జాప్యం చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ మేరకు ట్విట్టర్లో విమర్శించారు. శుక్రవారం ప్రకటించాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందని ఆరోపించారు. ‘మెగా వాగ్దానాలు, మరిన్ని ప్రారంభోత్సవాలు’ చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీకి మరింత సమయం ఇవ్వడానికే అని విమర్శించారు.
కాగా, ఈ పరిణామం పట్ల తమ పార్టీ ఆశ్చర్యపోలేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు. ‘సహజంగానే కొన్ని మెగా వాగ్దానాలు చేయడానికి, మరిన్ని ప్రారంభోత్సవాలు చేయడం కోసం ప్రధానమంత్రికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ఇలా జరిగింది. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను విడిగా నిర్వహించడాన్ని సీఈసీ సమర్థించింది. రెండు అసెంబ్లీల పదవీ కాలానికి మధ్య 40 రోజుల గ్యాప్ ఉందని, వాతావరణం కూడా ఒక కారణమని చెప్పింది.
అయితే ఈ వాదనను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, గోవా అసెంబ్లీల పదవీ కాలం మధ్య 60 రోజుల గ్యాప్ ఉన్నప్పటికీ పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్తో కలిపి ఎన్నికలు నిర్వహించిన సంగతిని గుర్తు చేసింది.
obviously this has been done to give more time to the PM to make some mega promises & carry out more inaugurations. Not at all surprising. https://t.co/LF1Vhw4WAw
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 14, 2022