న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన పర్వతారోహకుడు అనురాగ్ మాలూ(Anurag Maloo).. ఇటీవల మౌంట్ అన్నపూర్ణపై చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని పోలాండ్కు చెందిన పర్వతారోహకుడు రక్షించాడు. పోలాండ్ క్లైంబర్ ఆడమ్ బీలెక్కి(Adam Bielecki) .. ఎంతో సాహసం చేసి అనురాగ్ను రక్షించాడు. అయితే ఆ రెస్క్యూ స్టంట్కు చెందిన వీడియోను తాజా రిలీజ్ చేశారు. ఎవరెస్ట్ టుడే ట్విట్టర్లో ఆ సాహసోపేత ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేశారు.
We commend Adam Bielecki @AdamTheClimber for his unwavering courage and professionalism in the face of danger. Thank you for your incredible bravery and expertise in rescuing Anurag Maloo from the crevasse on Annapurna I (8091 m). Your help in rescuing Anurag Maloo from the… pic.twitter.com/bHrJj0Gq52
— Everest Today (@EverestToday) April 20, 2023
అసాధారణ రీతిలో ధైర్యాన్ని ప్రదర్శించిన పోలాండ్ పర్వతారోహకుడికి ఆ ట్వీట్లో థ్యాంక్స్ తెలిపారు. అనురాగ్ మలూను కాపాడిన తీరు పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆ ట్వీట్లో చెప్పారు. అయితే గత వారం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించిన అనురాగ్ మిస్సయ్యాడు. అతను సజీవంగా ఉన్నట్లు గురువారం అధికారులు వెల్లడించారు. విషమ పరిస్థితుల్లో ఉన్న అతన్ని హాస్పిటల్కు తరలించారని సోదరుడు సుధీర్ తెలిపాడు.
గత వారం కొంత మంది పర్వతారోహకులతో కలిసి అనురాగ్ మౌంట్ అన్నపూర్ణ ఎక్కాడు. అయితే ఏప్రిల్ 17వ తేదీన పర్వతం నుంచి దిగుతున్న సమయంలో ఆరు వేల మీటర్ల ఎత్తులో అతను జారిపడ్డాడు. అక్కడ చిక్కుకున్న అతన్ని పోలాండ్ మౌంటెనీర్ కాపాడాడు.
ప్రపంచవ్యాప్తంగా 8 వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న 14 పర్వతాలను ఎక్కాలన్న లక్ష్యంతో అనురాగ్ మాలూ పర్వతారోహణ కొనసాగిస్తున్నాడు. యూఎన్ గ్లోబల్ గోల్స్ అందుకునే లక్ష్యంతో అతను ఈ మిషన్ చేపట్టారు. రెక్స్ కారమ్ వీర్ చక్ర అవార్డును అతను గెలుచుకున్నాడు. 2041 అంటార్కిటికా యూత్ అంబాసిడర్గా కూడా ఇండియా నుంచి అతను ఎంపికయ్యాడు.