ఇంఫాల్: మణిపూర్లోని మోరేలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారిని అనుమానిత తిరుగుబాటుదారులు కాల్చిచంపారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. బాధితుడైన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చింగ్థామ్ ఆనంద్ను స్థానిక దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించినట్టు పేర్కొన్నది.
నివాస భవనాల నుంచి కాల్పులు జరగడంతో వెంటనే ప్రతిదాడులు చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన హెలిప్యాడ్ను రాష్ట్ర పోలీసుల రవాణా కోసం రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాడి అనంతరం హెలీప్యాడ్వద్ద భద్రతకు పంపిన కమాండోలపై మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేశారు.