Jharkhand | రాంచీ : జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో రంక పోలీసు స్టేషన్ పరిధిలోని డెంగురా గ్రామం వద్ద పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో రంక పీఎస్ ఇంచార్జి శంకర్ ప్రసాద్ కుష్వాహాకు బుల్లెట్ గాయాలయ్యాయి. శంకర్ ప్రసాద్ కుడి చేతికి తీవ్ర గాయమైందని, ప్రస్తుతం రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు జిల్లా ఎస్పీ దీపక్ కుమార్ పాండే తెలిపారు.
ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. పోలీసులపై జార్ఖండ్ జన్ ముక్తి మోర్చాకు సంబంధించిన మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.