చెన్నై: పాశ్చాత్య దేశాల నుంచి మరో విష సంప్రదాయం భారత్లోకి ప్రవేశించింది. వైఫ్ స్వాపింగ్ (భార్యల మార్పిడి) అనేది ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వినబడుతోంది. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఏకంగా వైఫ్ స్వాపింగ్ పార్టీనే ఏర్పాటు చేశారు. అయితే పార్టీ గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లి ఆ పార్టీని నిలిపేశారు. చెన్నై సమీపంలోని ఈస్ట్కోస్ట్ రోడ్డు (ECR) లోగల ఓ ఫౌంహౌజ్లో ఆ పార్టీ జరుగుతుండగా భగ్నం చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.
అనంతరం పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ వైఫ్ స్వాపింగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ముఠా సభ్యులు భార్యల మార్పిడి పార్టీల గురించి ప్రచారం చేసుకుంటూ.. వాళ్లను సంప్రదించిన జంటలతో పార్టీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత 8 ఏళ్లుగా ఈ ముఠా ఈ వైఫ్ స్వాపింగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. చెన్నైతోపాటు కోయంబత్తూరు, మధురై, సేలం, ఈరోడ్ ప్రాంతాల్లో ఈ వైఫ్ స్వాప్ పార్టీలు జరుగుతున్నాయి.
‘కోయంబత్తూరుకు చెందిన సెంథిల్ కుమార్ (45), జయలక్ష్మి (35) బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో నవంబర్ 4, 5 తేదీల్లో చెన్నైలోని పనయూర్లో ఫామ్హౌస్ను బుక్ చేసుకున్నారు. దీనికి 8 జంటలు, 10 మంది యువకులు వచ్చారు. ఇక రాత్రంతా భారీ శబ్దంతో మ్యూజిక్ పెట్టారు. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారు. మద్యం సేవించారు. తాగిన మత్తులో మహిళలను మార్చుకున్నారు. ఒకరి భార్యతో మరొకరు శృంగారంలో పాల్గొన్నారు. దీనిపై స్థానికుల ద్వారా సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగాము. ఫాంహౌజ్పై రైడ్ చేసి వైఫ్ స్వాప్ పార్టీని భగ్నం చేశాం’ అని పోలీసులు తెలిపారు. ఈ పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన 8 మంది పురుషులను మాత్రమే అదుపులోకి తీసుకుని, మిగతా వారితో మరోసారి ఇలాంటి పనిచేయమని కాగితాలు రాయించుకుని వదిలిపెట్టామన్నారు.