జెవార్ : ఉత్తరప్రదేశ్లోని జెవార్లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉత్తర భారత దేశానికి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వ్యూహాత్మకంగా కీలకంగా మారనున్నట్లు ఆయన తెలిపారు. నార్తర్న్ ఇండియాకు లాజిస్టిక్స్ కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్, వెస్ట్ యూపీ ప్రజలకు ఈ ప్రాజెక్టుతో లబ్ధి చేకూరనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు యూపీని విస్మరించాయన్నారు. బహుళజాతి కంపెనీలు తమ పెట్టుబడులకు యూపీనీ కేంద్రంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఇక్కడ అయిదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వాలు యూపీని చీకట్లోకి నెట్టేశాయని, ఇప్పుడు యూపీకి అంతర్జాతీయ గుర్తింపు వస్తోందన్నారు. ఏడు దశాబ్ధాల తర్వాత ఈ రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు. నోయిడ్ విమానాశ్రయం వేలాది మంది పశ్చిమ యూపీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ప్రధాని తెలిపారు.