Target 2024 : ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో ఆదివారం లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గిరిజన ప్రాబల్య జబువలో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో 370 స్ధానాలకు పైగా గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికలతో పోలిస్తే ప్రతి బూత్లో బీజేపీకి 370 ఓట్లు అదనంగా వేయాలని, కాషాయ పార్టీకి 370కి పైగా స్ధానాలు వచ్చేలా చొరవ చూపాలని ఓటర్లకు మోదీ విజ్ఞప్తి చేశారు. తాను జబువకు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం రాలేదని, మీ సేవకుడిగా వచ్చానని అన్నారు.
తాను లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించేందుకే వచ్చానని కొందరు మాట్లాడుకుంటున్నారని కానీ తాను ఓట్ల కోసం రాలేదని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను ఇక్కడకు వచ్చానని చప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఎన్నికల సమయంలోనే పేదలు, రైతులు గుర్తుకొస్తారని అన్నారు.
Read More :
Haryana | రైతుల చలో ఢిల్లీ.. హర్యానాలో బల్క్ ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ సేవలు బంద్