న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఎల్లుండి (ఈ నెల 5న) కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2013లో చార్ధామ్ను ముంచెత్తిన వరదల్లో ఆదిశంకరాచార్యుని సమాధి ధ్వంసమైంది. దాంతో ఆ సమాధిని పునర్నిర్మించారు.
ఆదిశంకరాచార్యుని విగ్రహావిష్కరణ అనంతరం.. కేదార్నాథ్లో ఇప్పటికే పూర్తయిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని ప్రారంభించనున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో సరస్వతి రిటెయినింగ్ వాల్ ఆస్థపథ్, ఘాట్లు, మందాకిని రిటెయినింగ్ వాల్ ఆస్థపథ్, తీర్థ్ పురోహిత్ ఇళ్లు, మందాకిని నదిపైన గల గరుడ్ చట్టి బ్రిడ్జ్ ఉన్నాయి. చివరగా అక్కడ ఏర్పాటు చేసే ఒక బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.