వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కాశీలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. జపాన్ దేశ సహకారంతో ఆ కేంద్రాన్ని నిర్మించారు. కాశీ అంటే శివుడు అని, రుద్రాక్ష్ లేకుండా ఆ నగరం అభివృద్ధి చెందినట్లు ఎలా చెబుతామని ఆయన అన్నారు. కాశీ పట్టణం ఇప్పుడు రుద్రాక్షను ధరించినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి ఆ పట్టణ శోభ మరింత పెరుగుతుందని ప్రధాని చెప్పారు. వారాణాసిలో పర్యటిస్తున్న ప్రధాని అక్కడ 1500 విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్లో రుద్రాక్ష మొక్కను నాటారు.
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడారు. వారణాసిలో రుద్రాక్ష్ సెంటర్ను నిర్మించినందుకు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిడే సుగాకు ఆయన కృతజ్ఞతలు ఎతలిపారు. ఇండో-జపాన్ స్నేహానికి రుద్రాక్ష్ సెంటర్ సంకేతంగా నిలుస్తుందని యోగి అన్నారు.
ఆధునిక సాంకేతికతో రుద్రాక్ష్ను నిర్మించారు. సుమారు 1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్ను జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో నిర్మించారు. దాదాపు 200 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో వారణాసిలోని సిగ్రా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ సెంటర్ లో అన్ని రకాల అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు కావాల్సిన సదుపాయాల్ని అందించనున్నారు.