PM Modi : బిహార్ సీఎంగా నితీష్ కుమార్ రికార్డుస్ధాయిలో తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మద్దతుతో మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్తో పాటు, నూతన బిహార్ టీంను మోదీ అభినందించారు. బీజేపీకి చెందిన సమ్రాట్ చౌధురి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్లో నూతనంగా కొలువుతీరిన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని మోదీ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌధురి, విజయ్ సిన్హాలకు అభినందనలని పేర్కొన్నారు. ఈ టీం రాష్ట్రంలోని నా కుటుంబసభ్యులకు అంకితభావంతో సేవలందిస్తుందనే విశ్వాసం తనకు ఉందని ప్రధాని హిందీలో ట్వీట్ చేశారు. ఇక బిహార్లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది.
ఉత్కంఠ నడుమ జేడీయూ అధినేత నితీశ్కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి ఏర్పాటు చేసిన మహాఘట్ బంధన్కు గుడ్బై చెప్పిన నితీశ్కుమార్.. మళ్లీ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పట్నాలోని రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. నితీశ్తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకరం చేశారు.
Read More :
Owaisi | బీహార్ ప్రజలకు నితీశ్ క్షమాపణ చెప్పాలి.. అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్