Owaisi | హైదరాబాద్ : జేడీయూ అధినేత నితీశ్ కుమార్పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీతో చేతులు కలపడాన్ని ఓవైసీ తప్పుబట్టారు. ఇలా కూటములు మారుతూ బీహార్ ప్రజలను నితీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారని, తక్షణమే బీహారీలకు ఆయన క్షమాపణ చెప్పాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
బీజేపీ బీ టీమ్ ఓవైసీ అని నిన్నటి వరకు నితీశ్ కుమార్ మాట్లాడారు. ఇప్పుడేమో అదే బీజేపీతో జతకట్టడం నితీశ్కు సిగ్గు అనిపిస్తలేదా అని ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్ ఎప్పటికైనా మళ్లీ ఎన్డీఏలో చేరుతారని, ఇదే విషయాన్ని తాను ఎప్పట్నుంచో చెబుతున్నానని ఓవైసీ గుర్తు చేశారు. ఈ దేశం మొత్తం తమ చేతుల్లోనే ఉండాలని బీజేపీ అనుకుంటుంది అని ఆయన అన్నారు.