Mallikarjuna Kharge | అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన విరమించి శనివారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో జరిగిన సభలో ఖర్గే మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని అన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులు ఎత్తేస్తామని, మరణించిన అన్నదాతల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని అప్పట్లో కేంద్రం హామీ ఇచ్చిందని ఖర్గే గుర్తు చేశారు. కానీ, ఇప్పటికీ ఆ హామీలు కేంద్రం నెరవేర్చలేదన్నారు.
‘వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళనలో పాల్గొన్న అన్నదాతలను కేంద్రం కార్లతో తొక్కించింది. 50 శాతం కనీస మద్దతు ధర కల్పించడంపై కేంద్రం ఇంకా స్పందించ లేదు. ఆందోళనలో మరణించిన 733 మంది రైతుల కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదు. రైతులపై నమోదైన కేసులలూ ఎత్తేయలేదు’ అని ఖర్గే ట్వీట్ చేశారు.
మూడు సాగు చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతలు 2020 డిసెంబర్ నుంచి ఏడాది పొడవునా భారీ ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో చాలా మంది రైతులు మరణించారు. ఈ చట్టాల విషయమై అన్నదాతలను ఒప్పించడంలో విఫలం కావడంతో వాటిని రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత రోజును కాంగ్రెస్ పార్టీ `కిసాన్ విజయ్ దివస్`గా నిర్వహిస్తున్నది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ.. కిసాన్ ఆందోళనలో మరణించిన రైతులకు మహారాష్ట్రలో శనివారం నివాళులర్పించారు.
किसानों को गाड़ी के नीचे कुचलवाने वाली मोदी सरकार ने किसानों को
🌾 Cost+50% MSP नहीं दिया
🌾 शहीद 733 किसानों को मुआवज़ा भी नहीं दिया और
🌾 उनके ख़िलाफ़ केस भी वापस नहीं लिया
इन्हीं आश्वासन पर पिछले साल किसानों ने आज ही के दिन “किसान विजय दिवस” मनाया था! pic.twitter.com/VgpNz6d9vw
— Mallikarjun Kharge (@kharge) November 20, 2022