శ్రీనగర్, మార్చి 7: ఆర్టికల్ 370పై కాంగ్రెస్ దేశాన్ని తప్పుదారి పట్టించిందని, దీని వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ గురువారం జమ్ముకశ్మీర్లో పర్యటించారు. ఆర్టికల్-370 రద్దు తర్వాత ప్రధాని కశ్మీర్లో పర్యటించటం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో రూ.5వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు.
శ్రీనగర్లోని బక్షీ స్టేడియం వద్ద చేపట్టిన ర్యాలీలో ప్రధాని మోదీ కశ్మీరీలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై పలు విమర్శలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ స్వేచ్ఛా గాలుల్ని పీల్చుకుంటున్నదని, ఈ ప్రాంత అభివృద్ధి మరోస్థాయికి చేరుకున్నదని ప్రధాని అన్నారు. భారతదేశానికి జమ్ముకశ్మీర్.. శిరస్సు వంటిదన్నారు. అభివృద్ధి, గౌరవానికి చిహ్నంగా అదెప్పుడూ తలెత్తుకొని ఉండాలన్నారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధి భారత్ అభివృద్ధికి కీలకమన్నారు.