అయోధ్య: తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ(PM) అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వాత సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య యాత్ర అనంతమైందని చెప్పిన ప్రధాని మోదీ.. ఆయా రాష్ట్రాల్లో భక్తులు చేపట్టే యాత్రల గురించి వివరించారు. జ్యోతిర్లింగ యాత్ర, ఛార్ధామ్ యాత్ర, శబరిమల యాత్రల గురించి చెబుతూనే తెలంగాణలో జరిగే సమ్మక్క సారక్క, నాగోబా జాతరలను కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.