Ayodhya | అయోధ్య : అయోధ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో 84 సెకన్ల పాటు కన్నుల పండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో అయోధ్య నగరం మార్మోగిపోయింది. ఇక రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలను మోదీ గౌరవించారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం కూలీలపై ఆయన గులాబీ చల్లి ఆశీర్వదించారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులతో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi showers flower petals on the workers who were a part of the construction crew at Ram Temple in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/gJp4KSnNp6
— ANI (@ANI) January 22, 2024