న్యూఢిల్లీ: చైనా తాజాగా రిలీజ్ చేసిన మ్యాప్పై విమర్శలు వస్తున్నాయి. భారత్లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేశారు. లడాఖ్లో ఒక్క ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోలేదని ప్రధాని చెబుతున్నారని, కానీ అవన్నీ అబద్దాలు అని, చైనా తమ భూభాగాన్ని ఆక్రమించినట్లు లడాఖ్ ప్రజలందరికీ తెలుసు అని రాహుల్ అన్నారు. చైనా రిలీజ్ చేసిన మ్యాప్ అంశం చాలా తీవ్రమైందన్నారు. మన భూభాగాన్ని వాళ్లు లాగేసుకున్నారని ఆరోపించారు.
చైనా సోమవారం తమ దేశానికి చెందిన స్టాండర్డ్ మ్యాప్ను రిలీజ్ చేసింది. దాంట్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా ప్రాంతాలు తమ భూభాగంలో ఉన్నట్లు పేర్కొన్నది. అయితే చైనా మ్యాప్ అంశంపై ఇప్పటికే భారత్ తన నిరసన వ్యక్తం చేసింది. చైనా చర్యల వల్ల సరిహద్దు వివాదం మరింత జఠిలంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొన్నది.
1962లో యుద్ధం అక్సాయ్ చిన్ ప్రాంతంలో జరిగింది. దాన్ని చైనా ఆక్రమించింది. అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా చైనా గుర్తిస్తోంది. అయితే ఈ రెండు ప్రాంతాలను చైనా తన కొత్త మ్యాప్లో చూపించింది.