PM Modi : రైతుల బాగు కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సేద్యాన్ని టెక్నాలజీతో అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీలో గురువారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. దేశ ప్రతిష్టను సమున్నత శిఖరాలకు చేర్చాల్సిన సమయం ఆసన్నమైందని అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడుకను ప్రస్తావిస్తూ ప్రధాని పేర్కొన్నారు.
మనం దేవుడి నుంచి దేశానికి, రామ్ నుంచి రాష్ట్రానికి పయనం సాగించాలని వ్యాఖ్యానించారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మలచాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. యూపీ శరవేగంగా అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించలేమని అన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి చాలా కాలమైనా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని దేశంలోని చాలా భాగం అభివృద్ధికి దూరంగా ఉందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకుల అలక్ష్యంతో అధిక జనాభా కలిగిన యూపీ అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. పశ్చిమ యూపీలో ఈరోజు రూ. 19,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. రైల్వేలు, హైవేలు, పెట్రోలియం పైప్లైన్లు, వాటర్ సప్లై ప్రాజెక్టుల అప్గ్రేడ్తో పాటు మెడికల్ కాలేజీలను ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. యమున, రామ్గంగా నదుల ప్రక్షాళన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అన్నారు.
Read More :
Kangana Ranaut | డేటింగ్లో ఉన్నది నిజమే.. కానీ అతడుకాదు: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా