Kangana Ranaut | గత సంవత్సరం వరుస సినిమాలతో తెరపై సందడి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆ లోటును తీర్చేయడానికి త్వరలో ‘ఎమర్జెన్సీ’ సినిమాతో అభిమానుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రమే ‘ఎమర్జెన్సీ’. ఇందుకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ను సైతం ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ‘భారతదేశంలో చీకటి క్షణాల వెనుక ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలో ఎక్కువ భయపడిన, భయపెట్టిన ప్రధానమంత్రిని జూన్ 14న థియేటర్లలో చూడండి’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సినిమాలో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది కంగనా.
ఇదిలావుండగా ఆమె తాజాగా చేసిన మరో పోస్ట్ నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో తాను రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై కంగనా రనౌత్ స్పందించారు. అవన్నీ వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. ‘దయచేసి అసత్య ప్రచారం చేయకండి. ఇదే నా విన్నపం. నిషాంత్కి పెళ్లయింది. ఆయన వైవాహిక జీవితం సంతోషంగా ఉంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్లో ఉన్నా. సరైన సమయం కోసం ఎదురుచూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మాట్లాడటం సబబు కాదు. మళ్లీ ఇలా చేయొద్దు’ అని ఆమె కోరారు. ఇటీవల ఆమె ఓ వ్యక్తితో కలిసి ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అతను తన హెయిర్ ైస్టెలిష్ట్ అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.