న్యూఢిల్లీ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Polls) ప్రజలు బీజేపీని గెలిపిస్తే అవినీతిపరుల జట్టును పారదోలతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తారానగర్లో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాట్స్మన్ ఒకరినొకరు రనౌట్ చేసుకునే క్రికెట్ టీం వంటిదని ఎద్దేవా చేశారు.
సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య సీఎం కుర్చీ కోసం జరుగుతున్న కలహాలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే రాజస్ధాన్ను వేగంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తమను గెలిపిస్తే అవినీతి జట్టును మట్టికరిపించి అభివృద్ధి దిశగా మెరుగైన స్కోర్ చేస్తామని రాజస్ధాన్ విజయం సాధించేలా చేస్తామని చెప్పారు.
రాజస్ధాన్ యువత, మహిళల భవిష్యత్కు పాటుపడతామని భరోసా ఇచ్చారు. రాజస్ధాన్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ కనుమరుగవుతుందని మోదీ జోస్యం చెప్పారు. రాజస్ధాన్లో ఐదేండ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు పెచ్చుమీరాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :