Target 370 : ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధతను చాటారు. తాము వంద రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370కి పైగా స్ధానాలు ఖాయమని, ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్సభలో ప్రధాని మోదీ సోమవారం(PM Modi) మాట్లాడారు. మోదీ తన ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ తీరు తోనే విపక్షాలకు ఇంతటి దుస్ధితి ఎదురైందని ఎద్దేవా చేశారు. ఇక తమ హయాంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చామని, చంద్రయాన్ 3 విజయవంతమైందని వివరించారు.
కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు సాయం చేస్తున్నామని అన్నారు. రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. ఇక మేకిన్ ఇండియాతో తక్కువ ధరకే మొబైల్స్, డేటా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
Read More :