Semicon India 2024 : దేశీయంగా పెద్దసంఖ్యలో చిప్స్ తయారీపై భారత్ ప్రస్తుతం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు. గ్రేటర్ నోయిడాలో బుధవారం ఇండియా ఎక్స్పో మార్ట్లో సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.
సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. భారత్ అనుసరిస్తున్న విధానాలతో భారత్లో లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ రంగ మార్కెట్ 150 బిలియన్ డాలర్లకు పైగా ఉందని, దీన్ని మరింత పెంచాలనేది తమ లక్ష్యమని ప్రధాని వివరించారు.
ఈ దశాబ్ధం చివరికి మన ఎలక్ట్రానిక్ రంగం 500 బిలియన్ డాలర్ల స్ధాయికి ఎదగాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నామని తెలిపారు. దీంతో భారత యువత కోసం ఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నైపుణ్యాలు సంతరించుకుంటే పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు మన యువతకు పుష్కలంగా లభిస్తాయని మోదీ వివరించారు.
Read More :
Revanth Reddy | 16న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో 21వ సారి