న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి కుటుంబమే లేదంటూ ఆదివారం పాట్నాలో జరిగిన ర్యాలీ సందర్భంగా ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలు సోమవారం మోదీకి మద్దతుగా నిలిచారు. తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్లలో తమ పేర్లకు ‘మోదీ కా పరివార్( మోదీ కుటుంబసభ్యులం)’ అంటూ జోడింపు చేశారు. దేశవ్యాప్తంగా చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ మేరకు ప్రకటించుకొన్నారు.