న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు దేశం ఘన నివాళులు అర్పించింది. కశ్మీర్లో లేత్పొరా వద్ద ఉన్న పుల్వామా అమరవీరుల మెమోరియల్తో పాటు పలు ప్రాంతాల్లో పలువురు సైనికాధికారులు, సామాన్య ప్రజలు పుష్పగుచ్ఛాలు ఉంచి, కొవ్వొత్తులు వెలిగించారు.
దేశరాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ర్టాల్లో ఈ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. జవాన్ల విలువైన త్యాగం మరువలేదని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. 2019, ఫిబ్రవరి 14న దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో చోటుచేసుకొన్న ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.