న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా మార్చేందుకు కలాం కృషి చేశారని కొనియాడారు. దేశ ప్రజలకు అబ్దుల్ కలాం స్ఫూర్తిగా నిలుస్తారు అని మోదీ పేర్కొన్నారు.