న్యూఢిల్లీ: ఇవాళ స్వామి వివేకానంద జయంతి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వివేకానంద జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం ధారపోశారన్నారు. జాతి నిర్మాణంలో పాలుపంచుకునే విధంగా యువతను ప్రేరేపించినట్లు ఆయన వెల్లడించారు. మన దేశం కోసం వివేకానంద కన్న స్వప్నాలను నిజం చేసేందుకు అందరం కలిసి పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.