న్యూఢిల్లీ, జూన్ 6: పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ తన ఆర్థిక సలహా మండలితో శనివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఉన్న వ్యాపారాలకు ఊతం ఇవ్వడం, దిగుమతులను తగ్గించుకోవడంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
బయటి దేశాల నుంచి వస్తున్న ఒడిదొడుకులను తట్టుకోవడంతో పాటు దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను పెంచే వ్యూహాలను రచించాలని ప్రధాని అధికారులను కోరినట్టు తెలిసింది. ఇంధన సరఫరా, భౌగోళిక ప్రభావిత రాజకీయాలు, ఆర్థిక ద్రవ్యోల్బణంపై కీలకంగా చర్చలు జరిపారు.