PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) కలిశారు. బుధవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ, దిల్జిత్ ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా గాయకుడిపై మోదీ ప్రశంసలు కురిపించారు. మరోవైపు మోదీని కలవడం పట్ల దిల్జిత్ సంతోషం వ్యక్తం చేశారు. 2025 ఏడాది గొప్పగా ప్రారంభమైందని పేర్కొన్నారు. మోదీతో సమావేశం ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు.
A fantastic start to 2025
A very memorable meeting with PM @narendramodi Ji.
We talked about a lot of things including music of course! pic.twitter.com/TKThDWnE0P
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 1, 2025
Also Read..
Jharkhand | భార్యతో గొడవ.. బావిలో పడ్డ భర్త.. కాపాడబోయి మరో నలుగురు మృతి
Australia Parent Visa | ఆస్ట్రేలియా పేరెంట్ వీసా కావాలంటే.. 31 ఏండ్లు ఆగాల్సిందే..
డిప్రెషన్లో యువకుడి చేతివాటం.. చెంపదెబ్బలు కొట్టి జైలు పాలయ్యాడు