బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ప్రారంభించిన మెట్రో స్టేషన్ను నాలుగు రోజుల్లోనే వరదలు ముంచెత్తాయి. దీంతో హడావుడిగా ప్రారంభించడంపై జనం మండిపడుతున్నారు. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరు (Bengaluru) లో రెండో దశ కింద వైట్ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు 13.71 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. అయితే మంగళవారం బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో నల్లూర్హళ్లి మెట్రో స్టేషన్ను వర్షం నీరు ముంచెత్తింది. ప్లాట్ఫారమ్, టికెట్ కౌంటర్ దగ్గర భారీగా వర్షం నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేంద్రంతోపాటు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాగా, వరదలమయంగా మారిన మెట్రో స్టేషన్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు స్పందించారు. చిన్న వర్షానికే ఆ మెట్రో స్టేషన్లో వర్షం నీరు నిలిచిపోతే ఇక వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రచారం కోసమే ఈ మెట్రో లైన్ను ప్రారంభించారని పలువురు విమర్శించారు. నిర్మాణ పనులు పూర్తి కాకుండా హడావుడిగా ప్రారంభిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని మరొకరు మండిపడ్డారు.
Inside the brand new Nallurhalli Metro station.
Water on the platform as well near the ticketing counter.
One light rain, and water has seeped inside fully. What will happen in rainy season?
Was incomplete metro innaugrated only for PM to get 2 mins of headlines? pic.twitter.com/T10qxWKnFN
— Kamran (@CitizenKamran) April 5, 2023
This is what one can expect when metro stations are opened in hurry without properly completing the works..
— Shanoj Devassy (@shanojdevassy) April 4, 2023
Also Read: