Viral News | పట్టాల (Track) పై రైలు (Train) వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే మనం వెంటనే ఏం చేస్తాం.. ఎర్రటి వస్త్రాన్ని (Red Colour Cloth) రైలు ముందు ఊపుతాం. దీంతో రైలు ఎక్కడైనా సరే వెంటనే ఆగిపోతుందన్న విషయం మనకు తెలుసు. తాజాగా ఓ బామ్మ కూడా అలానే చేసింది. గుండె ఆపరేషన్ (Heart Operation) అయినా లెక్క చేయకుండా పరుగున వెళ్లి.. రైలు ప్రమాదాన్ని తప్పించి అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది.
రైల్వే పోలీసులు (Railway Police) అందించిన వివరాల ప్రకారం.. మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో కర్ణాటక (Karnataka) రాష్ట్రం మంగళూరు (Mangaluru) -పడీల్ జోకెట్ట (Padil and Jokatte) మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందార (Mandara)లో రైలు పట్టాలపై ఓ భారీ వృక్షం విరిగి పడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబై (Mangaluru to Mumbai )కి మత్స్యగంధ రైలు (Matsyagandha Express) వెళ్తోంది. దీన్ని గమనించిన 70 ఏండ్ల వృద్ధురాలు చంద్రావతి (Chandravathi).. ప్రమాదాన్ని పసిగట్టింది. ఎలాగైనా రైలును ఆపేయాలని అనుకుంది. దీంతో సమయస్ఫూర్తితో ఆలోచించి ఎరుపు రంగు వస్త్రం తెచ్చి రైలు ముందు జెండాలా ఊపింది. దీన్ని గమనించిన లోకో పైలట్ (loco pilot) రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అనంతరం స్థానికుల సాయంతో పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. ఇంత పెద్ద ప్రమాదాన్ని తప్పించడంతో అందరూ చంద్రావతిని అభినందించారు.
అనంతరం ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ‘ఆరోజు మధ్యాహ్నం సమయంలో భోజనం చేసి ఇంటి ఆవరణలో కూర్చుని సేద తీరుతున్నా. ఆ సమయంలో ఉన్నట్టుండి ఇంటి ఎదురుగా ఉన్న పట్టాలపై పెద్ద చెట్టు విరిగిపడింది. అదే సమయంలో మంగళూరు నుంచి ముంబైకి రైలు వెళుతుందనే విషయం నాకు గుర్తొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికైనా ఫోన్ చేసి ఈ విషయం చెబుదామని ఇంట్లోకి వెళ్లా. అంతలోనే రైలు వస్తున్న శబ్ధం వినిపించింది. అప్పుడు ఇంట్లో ఉన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకుని పట్టాల వద్దకు వెళ్లా. నాకు గుండె ఆపరేషన్ అయిన విషయాన్ని కూడా లెక్క చేయలేదు. పరుగున వెళ్లి రైలు వస్తున్నప్పుడు పట్టాల పక్కన నిల్చొని ఎర్రటి వస్త్రాని జెండాలా ఊపాను. వెంటనే రైలు నెమ్మదించి ఆగిపోయింది’ అని చంద్రావతి వివరించింది.
Also Read..
Rupert Murdoch | నిశ్చితార్థం రద్దు చేసుకున్న వృద్ధ ప్రేమికులు.. కారణం ఏంటంటే..?
India Corona | 4 వేలకు పైనే కొత్త కేసులు.. 15 మంది మృతి
Balka Suman | బండి సంజయ్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి : బాల్క సుమన్