HomeNationalPm Modi In Bhopal On Tuesday That There Is A Need To Have A Common Civil Code Ucc For The Country
ప్రజల దృష్టి మరల్చేందుకే యూసీసీ
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
భోపాల్: దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ ఈ అంశాలను ముందుకు తీసుకొచ్చారని జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, ఎంఐఎం పార్టీల నేతలు పేర్కొన్నారు.
దేశంలో తీవ్రస్థాయిలో ఉన్న పేదరికం, ధరాఘాతం, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రధాని మోదీ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఘర్షణలతో మణిపూర్ మండిపోతున్నా, దానిపై మోదీ ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు.