అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది, రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 11 గంటలకు 19.06 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. తుది దశలో 14 జిల్లాల్లో విస్తరించిన 93 స్ధానాలకు పోలింగ్ జరగనుండగా 2.5 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తుది దశ పోలింగ్లో మొత్తం 833 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ధారించనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండో దశ పోలింగ్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక గుజరాత్లో డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్ జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అధికారం నిలుపుకోవాలని పాలక బీజేపీ శ్రమిస్తుండగా, బీజేపీని మట్టికరిపించి గుజరాత్ పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక పంజాబ్లో గెలుపొందిన జోష్లో ఉన్న ఆప్ గుజరాత్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడతాయి.