న్యూఢిల్లీ: ఇంటర్నెట్ చౌకగా లభిస్తున్నదని సమయాన్ని వృథా చేసుకోవద్దని ప్రధాని మోదీ విద్యార్థులకు సలహా ఇచ్చారు. పరీక్షా పే చర్చ 16వ ఎడిషన్ సందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యను భారంగా భావించకూడదని, పూర్తిగా మనస్సంతా లగ్నం చేసి చదవాలని చెప్పారు. కేవలం మార్కుల మీద దృష్టి కేంద్రీకరించకుండా జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నామనే దానిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.