PM Modi | దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తద్వారా పండిట్ జవహర్లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు (Longest Ever Speech).
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఇవాళ ఉదయం మోదీ 98 నిమిషాల పాటు జాతినుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకు ముందు 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇప్పటి వరకూ అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించారు. ఇక మోదీ ప్రసంగాల్లో 2017దే అతిచిన్నది. ఆ ఏడాది కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.
మోదీ కంటే ముందు..
1947లో జవహర్లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా 1954 , 1966లో వరుసగా 14 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగాలు చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎర్రకోట నుంచి అతి తక్కువ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. 2012, 2013లో మన్మోహన్ సింగ్ ప్రసంగాలు వరుసగా 32, 35 నిమిషాలు మాత్రమే సాగాయి. 2002, 2003లో వాజ్పేయి ప్రసంగాలు 25, 30 నిమిషాల కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read..
PM Modi | మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి : ప్రధాని మోదీ
PM Modi | బంగ్లాదేశ్లో హిందువుల, మైనారిటీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల ఆందోళన : పీఎం మోదీ