న్యూఢిల్లీ: షరియత్ చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ కేరళకు చెందిన ముస్లిం మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. షరియత్ నిబంధనల ప్రకారం.. ఆస్తి పంపకంలో పురుషులతో సమానంగా మహిళలకు వాటా దక్కడం లేదని, ఇది రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘించడమేనని బుషారా అలీ అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు విచారణకు స్వీకరించింది. షరియత్ నిబంధనలు అమలుచేస్తూ… తన సోదరులకు ఇచ్చిన ఆస్తిలో తనకు సగమే ఇచ్చారని బుషారా అలీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్దారు అక్కాచెల్లెల్లు, అన్నదమ్ములు మొత్తం 11 మందికి కోర్టు నోటీసులు జారీచేసింది.